Advertisement

‘పెళ్లి చూపులు’ పాప మళ్లీ వచ్చేస్తోంది!

Wed 30th Oct 2019 06:44 PM
pelli choopulu,tollywood,actress ritu varma,naga shourya  ‘పెళ్లి చూపులు’ పాప మళ్లీ వచ్చేస్తోంది!
Pelli Choopulu Actress Ritu Varma Comes Tollywood! ‘పెళ్లి చూపులు’ పాప మళ్లీ వచ్చేస్తోంది!
Advertisement

రీతూవర్మ.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా హిట్టయినప్పటికీ ఈ భామకు మాత్రం ఆశించినంత గుర్తింపు రాలేదు.. సినిమా అవకాశాలు ఆశించినంతగా రాలేదు. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు కానీ.. ఎక్కడెక్కడ్నుంచో వచ్చిన భామలకు మాత్రం గట్టిగానే వస్తున్నాయ్. ‘పెళ్లి చూపులు’ తర్వాత ‘కేశవ’ సినిమాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. తెలుగులో అవకాశాలు వస్తాయని వేయి కళ్లతో ఎదురుచూసినా రాకపోయే సరికి తమిళ్, మలయాళం వైపు రీతూ అడుగులేసింది. అక్కడ అరకొర సినిమాలతో సరిపెట్టుకుంటోంది. అయితే తాజాగా తెలుగమ్మాయికు సంబంధించిన ఓ న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది.

ఇప్పటికే.. మలయాళంలో కుర్రహీరో దుల్కర్ సల్మాన్ జోడీగా రీతూ ఓ సినిమా చేస్తోంది. అయితే ఈ తెలుగమ్మాయికి టాలీవుడ్‌లో నటించాలంటూ పిలుపువెళ్లిందట. నాగశౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మను దర్శకనిర్మాతలు ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ విషయాన్ని రీతూకు ఫోన్ ద్వారా సమాచారం అందించారట. సో.. మొత్తానికి చూస్తే తెలుగమ్మాయి మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తోందన్న మాట. సినీ కెరీర్‌లో అవకాశాల్లేక సతమతమవుతున్న రీతూకు ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో..? అసలు ఈ వార్తలో ఏ మేరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Pelli Choopulu Actress Ritu Varma Comes Tollywood!:

Pelli Choopulu Actress Ritu Varma Comes Tollywood!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement