ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sye Raa Narasimha Reddy Shooting Latest Update

సైరా హైలైట్ సీన్స్ చిత్రీకరణ మొదలైంది!

Sye Raa Narasimha Reddy Shooting Latest Update

ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రంగా 'సైరా..నరసింహారెడ్డి' రూపొందుతోంది. రామ్‌చరణ్‌ నిర్మాతగా కొణిదెల బేనర్‌లోనే దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని చాలెంజింగ్‌గా తెరకెక్కిస్తున్నాడు. తొట్ట తొలి తెలుగు స్వాతంత్య్రయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ఇది రూపొందుతోంది. ఎలాగైనా ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా 'బాహుబలి'ని ఢీ కొట్టే విధంగా తీయాలని యూనిట్‌ కసితో ఉంది. అందునా ఈ చిత్రంలో ఇండియన్‌ స్టార్స్‌ అందరు నటిస్తుండటం, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌సేతుపతి, కన్నడ క్రేజీ హీరో కిచ్చా సుదీప్‌, దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, జగపతిబాబు, తమన్నా వంటి భారీ క్యాస్టింగ్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. 

కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌ శివార్లలోని ఓ పాడుబడిన కోటలో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది. తెలుగు జాతిని అణిచివేసేందుకు తుపాకులతో పాటు పలు ఆయుధాలను బ్రిటీష్‌ సైన్యం ఓ కోటలో దాచి ఉంచగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన సహచరులతో కలిసి బ్రిటిష్‌ సైనికులను మట్టుబెట్టి ఆ ఆయుధాలను సొంతం చేసుకునే సీన్స్‌గా ఇవి ఉండనున్నాయి. ఈచిత్రంలో ఈ సీన్స్‌కి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. 

ఇక ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం హాలీవుడ్‌కి చెందిన హాలీవుడ్‌ స్టంట్‌ డిజైనర్‌, 'జేమ్స్‌బాండ్‌' సీరిస్‌లోని 'స్కైఫాల్‌', 'హారీ పోర్టర్', 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌'తో పాటు రెండు మూడు బాలీవుడ్‌ చిత్రాలకు స్టంట్స్‌ని డిజైన్‌ చేసిన గ్రేగ్‌ పావెల్‌ నేతృత్వంలో వీటి చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

Sye Raa Narasimha Reddy Shooting Schedule Starts

chiranjeevi
sye raa movie
shooting
updates