విద్యార్థిని జస్లీన్ కౌర్ ఆత్మహత్య గురించి స్పందించిన హీరో విశాల్
నీట్ లో ర్యాంక్ రాలేదని జస్లీన్ కౌర్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం విని చాలా బాధ అనిపించింది. నీట్ వల్ల ఒకరి తర్వాత ఒకరిగా చాలా మందిని కోల్పోయాం. దేశ భవిష్యత్తు విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల కలలు ఎండమావి గానే మిగిలిపోతాయి. విద్యార్థులు నీట్ పరీక్షని పబ్లిక్ సర్వీస్ పరీక్ష లాగే భావించి సాధించే వరకు ప్రయత్నించాలి. విద్యార్ధులకి సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.
నీట్ పరీక్షని భవిష్యత్తులో కొనసాగించేలా అయితే ప్రభుత్వమే విద్యార్ధులకి కోచింగ్ తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. పరిస్థితి ఇలానే ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్ధులకి వైద్య విద్య అనేది కలగానే ఉండిపోతుంది.
- విశాల్