ఎన్టీఆర్, చరణ్ ల మధ్య ఎమోషన్స్ తోనే సినిమా!
No Graphics in Rajamouli Next Filmఐదేళ్లపాటు బాహుబలి సీరీస్ తో కష్టపడిన రాజమౌళి ఇప్పుడు ఫుల్ రెస్ట్ లో ఉన్నాడని అనుకుంటున్నారు అంతా. కానీ రాజమౌళి మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టి చాలాకాలమే అయ్యిందనే విషయం మొన్న.. రాజమౌళి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో వరకు అర్ధం కాలేదు జనాలకు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పేసాడు రాజమౌళి. బాహుబలి సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఎంతో శ్రమటోడ్చిన రాజమౌళి తన తదుపరి చిత్రం ఎలాంటి గ్రాఫిక్స్ ఉండవనే విషయాన్నీ ఎప్పుడో మీడియా ముఖంగా చెప్పేశాడు.
మరి ఇద్దరు బడా స్టార్స్ తో సినిమా ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఇప్పుడు గ్రాఫిక్స్ లేకుండా ఎలా చెక్కుతాడా? అనే అనుమానం కొందరిలో ఉంది. అయితే రాజమౌళి... ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కడా చోటివ్వకపోయినా.. గ్రాఫిక్స్ కంటే ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సినిమా స్క్రీన్ ప్లే అల్లుతున్నారట. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళికి కథా రచయిత విజయేంద్రప్రసాద్ మధ్య చర్చ కూడా జరిగిందనే టాక్ వినబడుతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర, ఎన్టీఆర్ పాత్ర ఎలావుండబోతుందో.. అనేది వారిద్దరికీ రాజమౌళి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడంటున్నారు .
ఇక పక్కా స్క్రీన్ ప్లే పూర్తిగా సిద్దమయ్యాక ఎన్టీఆర్ కి చరణ్ కి మరోసారి కథని వినిపిస్తాడట రాజమౌళి. అలాగే సినిమాలో ఎమోషనల్ డ్రామా ఉంటుందని.. గ్రాఫిక్స్ ఉండవనే విషయాన్నీ కూడా హీరోలిద్దరికి క్లారిటీగా చెప్పాడట. ఇకపోతే గ్రాఫిక్స్ లేకపోయినా యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదని... హై ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులతో పక్కా కమర్షియల్ సినిమాని ప్రేక్షకులకు అందిస్తాడట రాజమౌళి.
Rajamouli film on Jr NTR and Ram Charan Emotions






































