Advertisementt

విశాల్‌ నిర్ణయం అదిరిపోయింది...!

Fri 07th Apr 2017 08:19 PM
hero vishal,tamil film industry,movie release first day give one rupee to farmars,producers  విశాల్‌ నిర్ణయం అదిరిపోయింది...!
విశాల్‌ నిర్ణయం అదిరిపోయింది...!
Advertisement
Ads by CJ

హీరో విశాల్‌ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన ప్యానెల్‌ ప్రమాణస్వీకారం చేసింది. పలువురు సీనియర్‌ నిర్మాతల చేతుల మీదుగా ఈ ప్రమాణస్వీకార వేడుక జరపడం హర్షణీయం. ఇక ఈ సందర్భంగా విశాల్‌ నిర్మాతల మండలి తరుపున సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమిళనాడులో ప్రదర్శిమయ్యే ప్రతి చిత్రం టిక్కెట్‌లోంచి ఓ రూపాయిని కష్టాలలో ఉన్నతమిళరైతులకు ఇస్తామని ప్రకటించాడు. ఈ నిర్ణయం ప్రకారం ప్రతిసినిమా కూడా ఏదో ఒకరోజు అమ్ముడైన టిక్కెట్లలోంచి ఓ రూపాయిని రైతు నిధిగా ఇవ్వాలి. తమకు న్యాయం చేయాలని ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల ఖర్చుకు ముందుగా దీనిని ఉపయోగిస్తారు. కాగా ఏ రోజు అనేది తేదీని ప్రకటించాల్సివుంది. ఈ నిర్ణయం మీద తమిళనాడు వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఆ ఒక్క రూపాయిని సినిమా విడుదలైన తొలిరోజే ఇచ్చేలా విశాల్‌ నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. దీనిపై విశాల్‌ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ