Advertisement
TDP Ads

ప్లానింగ్‌ అంటే ఇది..!

Tue 01st Mar 2016 02:59 PM
kshanam movie,pvp banner,adavi sesh,adah sharma  ప్లానింగ్‌ అంటే ఇది..!
ప్లానింగ్‌ అంటే ఇది..!
Advertisement

పివిపి సినిమాస్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ వారు సంయుక్తంగా నిర్మించిన సస్పెన్స్‌ డ్రామా చిత్రం 'క్షణం'. అడవి శేష్, ఆదాశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అనసూయ సరికొత్త పాత్రలో కనిపించింది. రవికాంత్‌ పేరేపు దర్శకునిగా పరిచయం అయిన ఈ చిత్రం ఈ వీకెండ్‌ విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మహేష్‌బాబు, సమంతలు ఈ సినిమాను ప్రమోట్‌ చేయడం, ట్రైలర్స్‌ ఆకట్టుకునే విధంగా ఉండడం, పబ్లిసిటీ కూడా బాగా చేయడంతో మంచి ఓపెనింగ్స్‌ సాధించింది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి మూడు నాలుగు రెట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను కేవలం కోటిరూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే పబ్లిసిటీ కోసం మరో కోటి ఖర్చు చేశారు. ఇలా మొత్తం రెండు కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తయారైంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఓవరాల్‌ రన్‌లో కనీసం 6 నుండి 8కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక శాటిలైట్‌ రూపంలో నిర్మాతలకు మరింత లాభం రాబోతోంది. దీన్ని చూసిన వారు ప్లానింగ్‌ అంటే ఇలా ఉండాలి.....! అనుకుంటున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement