గతంలో జరిగిన పొరపాట్లను మరోసారి జరగకుండా ఉండేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందుకుగాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదని ఆయన తన టీమ్ను హెచ్చరిస్తున్నారు. ఇందతా 'బాహుబలి-ది బిగినింగ్'లో జరిగిన లేకేజీని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. ఈ నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే టీమ్ మొత్తాన్ని కూర్చోబెట్టి ఓ వార్నింగ్ ఇచ్చాడు. అందులో భాగంగానే మొబైల్ ఫోన్లను షూటింగ్ సమయంలో వాడకూడదనే నిర్ణయంతో పాటు ఈ చిత్రం గురించి ఎవరు ఏమని అడిగినా.. మాకేం తెలియదు.. రాజమౌళిగారిని అడగండి... అని చెప్పాలని హుకుం జారీ చేశాడు. ఫస్ట్పార్ట్ సందర్భంగా కీరవాణి పాటలు కూడా ఆడియో విడుదలకు ముందుగానే బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ విషయంలో రాజమౌళి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు.