మ్యాసీవ్ బ్లాక్బస్టర్స్ సలార్, కల్కి 2898 AD తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం కొలాబరేట్ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ చాలా ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఈ వార్తను ఆయన స్వయంగా షేర్ చేశారు. గొప్ప పాత్రలు చేయడంలో పేరుపొందిన అనుపమ్, ఈ సినిమా స్క్రిప్ట్ను అద్భుతం అని అన్నారు. ప్రభాస్తో స్క్రీన్ స్పేస్ను పంచుకోవడానికి ఉత్సాహంగా వున్నారు. దర్శకుడు హను రాఘవపూడి ప్రతిభను కూడా ఆయన ప్రశంసించారు.
అనౌన్స్మెంట్: #ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ తో నా 544వ చిత్రాన్ని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది, #ఈ చిత్రానికి అద్భుతమైన ప్రతిభావంతులైన @హను రాఘవపూడి దర్శకత్వంవహిస్తున్నారు. @MythriOfficial అద్భుతంగా నిర్మిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్ #సుదీప్చటర్జీ #DoP! कमाल की कहानी है!! और क्या चाहिए लाइफ में दोस्तों! जय हो! 😍❤️🙌” అని అనుపేమ్ ఖేర్ షేర్ చేశారు
ఈ చిత్రం ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ల ఫస్ట్ కొలాబరేషన్. 1940 హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి పోరాటం చేసే ఓ యోధుడి కథగా ఉండబోతోంది.
ఇమాన్వి ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, వెటరన్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలు, ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో హై బడ్జెట్తో నిర్మించనున్నారు.