Advertisement
Google Ads BL

చంద్రబాబు అలా మాట్లాడటం సరికాదు!


మహానాడు సాక్షిగా చంద్రబాబు తమ ప్రసంగంలో బజారులో పశువులను కొన్నట్టు టిఆర్‌ఎస్‌ తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయకులను కొన్నదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలనే సమర్ధిద్దాం. అంటే, తెలంగాణ టిడిపి నాయకులను పశువులుగా మనం అనుకోవాలా? పశువుల్ని తీసుకొచ్చి ఇంతకాలం ఈ పశువులే మీ నాయకులు అని చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టారని అనుకోవాలా? పశువుల్లాంటి నాయకులను ప్రజలనెత్తిన రుద్దింది ఎవరు? ఈ నాయకులు పోతేపోయారు, కొత్త నాయకులను తయారు చేసుకుంటాం ` అన్నారు చంద్రబాబు. తలసాని, తుమ్మల, తీగల ఎక్కడివారో ఎవరివారో చెప్పండి చంద్రన్నా!

Advertisement
CJ Advs

చంద్రబాబు పార్టీ ఫిరాయించిన తన నాయకులను పశువులు అనవలసిన అవసరంలేదు. కెసిఆర్‌కి తెలంగాణని పాలించే సత్తాలేక తన ఎమ్మెల్యేలను తీసికెళ్ళి మంత్రి పదవులు కట్టబెట్టి పాలన సాగిస్తున్నాడు- తన ఆలోచనా ధోరణినే అవలంబిస్తున్నాడు- పాలనకు తెలుగుదేశం పార్టీపైనే ఆధారపడుతున్నాడు ` అని హుందాగా మాట్లాడితే బాగుండేది. తన లెగసీ కంటిన్యూ అవుతున్నందుకు పరిణతిచెందిన నాయకునిగా ఆనందించాలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs