Advertisement

నాగం పార్టీ మారనున్నాడా..??


నాగం జనార్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. తెలంగాణ అంశం గురించి బాబుతో విబేధించి నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆయన మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా బీజేపీలో క్రీయాశీలకంగా ఉండాలని ప్రయత్నించిన నాగంకు పార్టీ అధిష్టానం నుంచి మద్దతు కరువైందని ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు తన ముఖ్య అనుచరులతో ఓ సమావేశం కూడా నిర్వహించి భవిష్యత్తు ప్రణాళిక గురించి కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.

Advertisement

 

 ఈ భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ముఖ్య అనుచరులంతా మళ్లీ ఆయన్ను టీడీపీలోకి వెళ్లమని సూచించినట్లు తెలిసింది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుననా చంద్రబాబుతో ఎలాంటి సమస్య లేనందునా నాగం ఇప్పుడు టీడీపీలోకి వెళ్లడమే ఉత్తమమని వారు సూచించారు. ఈ మేరకు త్వరలోనే నాగం పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే టీడీపీ పార్టీ పూర్తిగా బలహీనపడుతోంది. అలాంటి సమయంలో నాగం తెలుగు దేశంలోకి వెళ్లి ఏంసాధిస్తారన్నది ఎవరికీ అర్థంకాకుండా ఉంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement