విజయ్ దేవరకొండ హీరోగా రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రెడీ జనార్దన సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం కీర్తీ సురేష్ను సంప్రదించారు. కథ నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. త్వరలోనే మిగతా వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ, కీర్తీ సురేష్ కలిసి మహానటిలో నటించిమా, కలిసి రొమాన్స్ మాత్రం ఇదే మొదటిసారి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరి వీరి జోడీ సినీ ప్రేమికుల అంచనాలను అందుకుంటుందా..? లేదా అనేది చూడాల్సిందే.