ధనుష్- శేఖర్ కమ్ముల - నాగార్జున కలయికలో క్రేజీ మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న కుబేర రిలీజ్ డేట్ని ఫైనల్లీ అనౌన్స్ చేశారు మేకర్స్. నిన్నమొన్నటివరకు టైటిల్ కాంట్రవర్సీలో చిక్కుకున్న కుబేర ఎట్టకేలకు సమస్యలు తీర్చుకుని విడుదల తేదీని ప్రకటించుకుంది. 20 జూన్, 2025న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ కుబేర ఫస్ట్ లుక్తోనే ఈ చిత్రంపై అంచనాలు పెంచేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
నాగార్జున ఆఫీసర్గా కనిపించబోతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పుడు కుబేర చిత్రానికి సంబంధించి ఓటీటీ పార్టనర్ కూడా లాకైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రేజీ మల్టీస్టారర్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఫ్యాన్సీ డీల్తో అన్ని లాంగ్వేజెస్కి సంబంధించి డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి థియేటర్స్లో జూన్లో విడుదల కాబోతున్న కుబేర ఓ ఆరు వారాల అగ్రిమెంట్తో అమెజాన్ ప్రైమ్లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి.