Advertisement

రాజేంద్రప్రసాద్ ఇంటికి ప్రభాస్


సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి ఈ శనివారం ఉదయం సడన్ గా గుండె పోటుతో మృతి చెందడం పట్ల రాజేంద్ర ప్రసాద్ స్నేహితులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె హఠాన్మరణానికి కుంగిపోయారు. విపరీతమైన బాధతో కుమార్తె గాయత్రి కు కడసారి వీడ్కోలు పలికారు. 

Advertisement

రాజేంద్ర ప్రసాద్ పరామర్శించేందుకు అల్లు అర్జున్, ఇంకా చాలామంది నటులు ఆయన ఇంటికి తరలి వెళ్లారు. ఆయనతో పని చేసిన నటులు వెళ్లి రాజేంద్రప్రసాద్ ను పరామర్శించి వచ్చారు. అయితే శనివారం జరిగిన ఈఘటన తర్వాత పాన్ ఐడియా స్టార్ ప్రభాస్ ఈరోజు బుధవారం రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. 

కూకట్‌పల్లి ఇందు విల్లాస్ లోని రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లిన ప్రభాస్.. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.

Prabhas at Rajendra Prasad house:

 Prabhas Visited Rajendra Prasad house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement