Advertisement

రోజా పై ఇంత పగ పెంచుకున్నావా రాజా


జబర్దస్త్ మాజీ కమెడియన్, నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు తో బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత జనసేన కండువా కప్పుకున్న కిర్రాక్ ఆర్పీ తనకు లైఫ్ నిచ్చిన, జబర్దస్త్ లో జడ్జి గా, తన ఇంటి దేవతగా పూజించిన RK రోజా విషయంలో ఇప్పుడు తనేం మాట్లాడుతున్నాడో అనేది తనకే అర్ధం కాని కామెంట్స్ చేస్తున్నాడు.

Advertisement

ఒకప్పుడు దేవత లా కనిపించిన రోజా ఇప్పుడు దెయ్యమై కనిపిస్తుంది ఆర్పీకి. జనసేన పార్టీలోకి చేరిన ఆర్పీ రోజాపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. జబర్దస్త్ బ్యాచ్, కమెడియన్స్ బ్యాచ్ అంతా మెగా ఫ్యామిలీ భజన చెయ్యకపోతే అవకాశాలు రావు అని వెక్కిరించిన రోజాకు ఆర్పీ అవకాశం ఉన్నప్పుడల్లా చుక్కలు చూపిస్తున్నాడు. 2024 ఎన్నికల సమయంలోనే రోజా ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న ఆర్పీ ఈమధ్య కాలంలో రోజా ఎప్పుడైనా యాక్టీవ్ అయ్యింది అంటే అప్పుడు వెంటనే లైన్ లోకి వచ్చేస్తున్నాడు.

రీసెంట్ గా రోజా లడ్డు వివాదం పై చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా ఆర్పీ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరీ రోజాపై కామెట్స్ చేసాడు. తిరుమల లడ్డు లో రోజా కొవ్వు కలిపారు, ఎందుకంటే రోజా నా దృష్టిలో పంది తో సమానం, పంది కొవ్వుని లడ్డులో వాడారు. రోజా కొవ్వుని తిరుమల లడ్డులో వాడారు అంటూ రోజాపై ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

అది విన్న నెటిజెన్స్ రోజా పై ఇంత పగ పెంచుకున్నావా రాజా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

RP comments on RK Roja:

Tirumala Laddu Issue: Kiraak RP comments on Roja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement