Advertisement
Google Ads BL

ఘాటైన పోస్ట్ పెట్టిన అనసూయ


తేనె తుట్టును కదిపించినట్టుగా అనసూయ మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని కదిలించింది. నిన్న సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనసూయకి విజయ్ దేవరకొండకి ఉన్న గొడవ పై ప్రశ్న ఎదురయ్యింది. అది నేను చేసింది కాదు మీడియా వలనే నేను బ్లేమ్ అయ్యాయని, స్టేజ్ మ్యానర్స్ గురించి ఆయనకు మీరు చెప్పాలి. మీరు మాట్లాడకుండా ఉన్నందుకే నేను మాట్లాడాను. అది సరిగ్గా కన్వే అవ్వలేదు. దాని వలన ఆయన అభిమానులు నన్ను ట్రోల్ చేసారేంటూ మరోసారి విజయ్ గొడవపై అనసూయ స్పందించింది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు విజయ్ దేవరకొండకి నాకు మద్యన ఏ ఇష్యుస్ లేవని కూడా చెప్పింది. కానీ ఆ ఈవెంట్ తర్వాత విజయ్ దేవరకొండ అభిమానులు మరోసారి రెచ్చిపోయి అనసూయ ని టార్గెట్ చెయ్యడంతో అనసూయ సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చింది. 

మరీ ఇంత చాతకాని వాళ్ళలాగ ఉంటే ఎలాగండి. నిజంగా మీకు కాలుతుంటే నా మీద కాదు.. అస్తమాను నేను ఏ పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళను అనండి దమ్ముంటే. కానీ మీరు అలా చెయ్యరు కదా.. ఎందుకంటే అది మీకు చేతకాదు. మీ హీరో లాగా ఆడవాళ్లను ఉద్దేశించి బూతులు తిట్టడం మత్రమే వచ్చు కదా పాపం.. still pray for y’all to #GetWellSoon and to get a real job 🙃 Goodnight!! అంటూ కాస్త ఘాటుగానే విజయ్ దేవరకొండ అభిమానులను ఉద్దేశించి అనసూయ వేసిన ట్వీట్ వైరల్ గా మారగా.. కొంతమంది అభిమానులు మళ్ళీ ఏమైంది అనసూయ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Anasuya posted a powerful post:

Anasuya powerful post on Vijay Devarakonda fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs