దేవర భామ జాన్వీ కపూర్ హాస్పిటల్ పాలయ్యింది. ఆమె ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురైనట్లుగా, వెంటనే ఫ్యామిలీ మెంబెర్స్ ఆమెని ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియా ద్వార సమాచారం అందుతుంది. గత వారం అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో చలాకీగా తిరిగిన జాన్వీ ఇలా ఆసుపత్రి పాలవడం ఆమె అభిమానులకు షాక్ కి గురిచేసింది.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో కలిసి సందడి చేసిన జాన్వీ కపూర్ తిన్న ఆహారం కల్తీ కావడంతో తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ముంబైలోని ఒక హాస్పటల్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.
రేపు అంటే శుక్రవారం జాన్వీ కపూర్ ని డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్స్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా ధ్రువీకరించినట్లు సమాచారం.