Advertisement

నిద్ర లేచిన జగన్


గత పదిరోజులుగా బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్న జగన్ మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారో.. లేదంటే ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటున్నారో కానీ.. పది రోజులుగా జగన్ మోహన్ రెడ్డి అలికిడి సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇక్కడ అసెంబ్లీలో ఒక్కరోజు కనిపించి మాయమై పులివెందులలో తేలిన జగన్ అక్కడి నుంచి అటే బెంగుళూరు ప్యాలెస్ కి చెక్కేసిన విషయం తెలిసిందే. 

Advertisement

పది రోజులుగా సైలెంట్ గా కూర్చున్న జగన్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు కి వారింగ్ ఇచ్చెయ్యగానే.. బాబు భయపడిపోవాలట. జగన్ బాబు కి వార్నింగ్ ఇవ్వడం చూసిన జనాలు అబ్బ జగన్ నిద్ర లేచాడే అంటూ కామెంట్ చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు ఓటమి విషయంలో ఎమ్యెల్యేలతో, మాజీలతో చర్చించిన జగన్ నేడు పిన్నేల్లిని జైలులో కలిసి ప్రెస్ మీట్ కి వచ్చాడు. 

ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టినందుకు కాదు పదిరోజుల తర్వాత అతని పై హత్యాయత్నం కేసు పెడతారా, పిన్నెల్లి తప్పు లేదు అనడానికి ఈ బెయిల్ లే ఉదాహరణ.. ఎల్లకాలం రోజులు మీవే ఉండవు చంద్రబాబు. ఇదే మాదిరి కొనసాగితే.. గనక రేపు అదే రిపీట్ అవుతుంది. భవిష్యత్తులో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మీ ప్రభుత్వం ఓడిపోయి మా ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్ష సాధింపు చర్యలే ఉంటాయి.. ఇదే చంద్రబాబుకి నా వార్నింగ్ అంటూ జగన్ వీరావేశంతో మాట్లాడాడు. 

జగన్ లో మార్పు చూసిన వైసీపీ కార్య కర్తలు సోషల్ మీడియాలో జగనన్న వచ్చాడు, చంద్రబాబు కి ఇక చుక్కలే, అధైర్యం చూడండిరా అని సంతోషపడుతుంటే.. హా వచ్చాడమ్మా ఇన్నాళ్ళకి, ఇప్పుడు నిద్ర లేచాడు మీ జగన్, సిగ్గూ ఎగ్గూ లేకుండా ఒక నేరస్థుడిని పట్టుకుని ఇట్టా డిఫెండ్ చేస్తున్నాడేంటి? అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తూ టీడీపీ వాళ్ళు బిజీగా కనిపిస్తున్నారు. 

YS Jagan Warning to CM Chandrababu Naidu:

YS Jagan Serious Comments on Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement