ఏపీలో ఈసారి గేమ్ ఛేంజర్స్ గా మహిళా ఓటర్లు నిలవబోతున్నారనిపిస్తుంది. హోమ్ మేకర్స్.. కింగ్ మేకర్స్ గా నిలిచేందుకు సమయం ఆసన్నమైంది. ఏపీలో మహిళలు పెద్ద ఎత్తున ఓటు వెయ్యడాకి పోటీపడడం, ఏపీలో నిన్న ఉదయం తెల్లవారు ఝాము నుంచి నిన్న అర్ధరాత్రి వరకు కనిపించింది క్యూ లైన్స్ లో నిలబడిన మహిళలు చూస్తే అలా అనిపించకమానదు. గ్రామాల్లోను, పట్టణాల్లోనూ ఎక్కడ చూసినా మహిళా ఓటర్లదే పై చెయ్యి అన్నట్టుగా కనిపించింది.
మహిళా ఓటర్లే ఈసారి రాజకీయ పార్టీల గెలుపుని డిసైడ్ చెయ్యబోతున్నాయా అనేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు వలన, జగన్ వలన మహిళలు ఎంతగా లాభపడ్డారు. ఇప్పుడు రాబోయే ప్రభుత్వాల వలన తమకి ఎంత లాభం వస్తుంది.. చంద్రబాబు పథకాల వలన ఎంతొస్తుంది, జగన్ మ్యానిఫెస్టో ప్రకారం ఏడాదికి ప్రభుత్వం నుంచి ఎంతొస్తుంది అనేది మహిళలు ట్యాలీ చేసుకునే ఓటేశారా?
మరోపక్క పెన్షర్లు కూడా క్రేజీగా ఓటేసేందుకు రావడం చూస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగడమే కాదు.. ఏపీలో కూటమి రావాలో, జగన్ రావాలో అనేది ఈ మహిళా ఓటర్లే డిసైడ్ చేసేలా కనిపిస్తున్నారు. చూద్దాం మహిళలు చంద్రబాబుని.. లేదంటే జగన్ ని గద్దెనెక్కిస్తారా అనేది.!