Advertisement

వెబ్ సీరీస్ చేస్తానంటున్న ప్రముఖ దర్శకుడు


దర్శకుడు దేవాకట్టా సాయి ధరమ్ తేజ్ తో చేసిన రిపబ్లిక్ మూవీ ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేసినా.. ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.  దేవాకట్టా మేకింగ్ స్టయిల్ ని మెచ్చుకున్నారు. రిపబ్లిక్ తర్వాత దేవాకట్టా తదుపరి ప్రాజెక్ట్ పై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇపుడు ఆయన డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దేవాకట్టా ఓ వెబ్ సీరీస్ కి శ్రీకారం చుట్టారని టాక్. అది కూడా పాలిటికల్ బ్యాగ్డ్రాప్ లో ఉండబోతుంది. ఏపీ రాజకీయాల్లో హేమాహేమీలైన చంద్రబాబు-రాజశేఖర్ రెడ్డిలపై ఈ వెబ్ సీరీస్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

అంటే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుమార్తెని వివాహం చేసుకోకముందు, రాజశేఖర్ రెడ్డి తో కాలేజ్ లో స్నేహం చేస్తూ ఇద్దరూ కలిసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం, రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ప్రజల మనసులని గెలిచి ముఖ్యమంతి పదవిని అలంకరించడం, సీఎం గా ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం వరకు ఈ వెబ్ సీరీస్ కొనసాగుతుందట.

ఈ సీరీస్ ని దేవాకట్టా తొమ్మిది ఎపిసోడ్స్ గా చూపించబోతున్నారని.. రెండువారాల్లోనే ఈ సిరీస్ సెట్స్ మీదకి వెళుతుంది అని సమాచారం. అయితే చంద్రబాబు కేరెక్టర్ కి హీరో రానా అయితే బావుంటుంది అని దేవాకట్టా భావించినా, ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి తమిళ నటుడు ఆది పినిశెట్టిని తీసుకున్నారట. రాజశేఖర్ రెడ్డి పాత్రకి 30 వెడ్స్ 21, కీడకోలా నటుడు చైతన్యని అనుకుంటున్నారట. 

A famous director who wants to make a web series:

Deva Katta announced web series
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement