Advertisement
Google Ads BL

సెప్టెంబర్ 15కి ఫిక్సైన మాస్ రాజా


మాస్ మహారాజా రవితేజ సెప్టెంబర్ 15కి ఫిక్సయ్యాడు. అంటే.. ఆయన హీరోగా చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారని అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రీపోన్ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి కాబట్టి.. రవితేజ ఫిక్సయ్యాడు అనగానే.. ఇప్పుడంతా ఆ సినిమానే ముందుకు వచ్చేస్తుందని అనుకుంటారు. కానీ రవితేజ చిత్రమే కానీ.. టైగర్ నాగేశ్వరరావు సినిమా కాదు. రవితేజ యాక్ట్ చేసిన చిత్రం కాదు.. రవితేజ ప్రొడ్యూస్ చేసిన చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది.

Advertisement
CJ Advs

సెప్టెంబర్ 15న ముందు ఓ మూడు నాలుగు చిత్రాలను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అనూహ్యంగా అన్ని సినిమాలు సెప్టెంబర్ 28కి వాయిదా పడ్డాయి. దీంతో ఆ డేట్‌ని విడుదలకి ఒక్క విశాల్ చిత్రం మాత్రమే ఉంది. ఇక ఇదే ఛాన్స్ అనుకున్న రవితేజ.. తన నిర్మాణ సంస్థ అయిన ఆర్‌టి టీమ్‌వర్క్స్‌లో రూపుదిద్దుకున్న ఛాంగురే బంగారురాజా చిత్రాన్ని హడావుడిగా లైన్‌లోకి తెచ్చేశాడు. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి మాస్ రాజా నిర్మించారు.

ఈ సినిమాని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అంతే కాదు.. ఈ నాలుగు రోజుల పాటు ప్రమోషన్స్‌ని వీర లెవల్‌లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అలా డేట్ అనౌన్స్ చేశారో లేదో.. వెంటనే ట్రైలర్ లాంచ్ అంటూ ఓ గ్రాండ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రవితేజ గెస్ట్‌గా రాబోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి అంతా వద్దనుకున్న డేట్‌ని, పండగని రవితేజ ఇలా వాడేసుకుంటున్నాడని ఇండస్ట్రీలో అంతా మాట్లాడుకుంటుండటం విశేషం.

Mass Maharaja Ravi Teja Master Plan Revealed:

Ravi Teja Produced Film Changure Bangaru Raja Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs