Advertisement

సుశాంత్ సింగ్ ఫ్లాట్ కొన్న ఆదా శర్మ ?


ద కేరళ స్టోరీ తో ఒక్కసారిగా ఫామ్ లోకొచ్చిన ఆదా శర్మ అంతకుముందు పెద్ద స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా ఇంతగా పేరైతే రాలేదు. కేరళ స్టోరీ కాంట్రావర్సీ ఆ చిత్ర కలెక్షన్స్ కి బాగా హెల్ప్ అయ్యాయి. ఆదెబ్బకు ఆదా శర్మ పేరు కూడా మీడియాలో మోగిపోయింది. అయితే తాజాగా ఆదా శర్మ ముంబైలోని ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అది దివంగత సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ నివసించి అక్కడే సూయిసైడ్ చేసుకున్న ఫ్లాట్ ని ఆదా శర్మ కొనుగోలు చేసింది అంటున్నారు. 

Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆ ఫ్లాట్ ని కొనుగోలు చెయ్యలేదు. ముంబై లోని బాంద్రా మౌంట్ బ్లాంక్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ నెలకి దాదాపు నాలుగున్నర లక్షల అద్దె చెల్లిస్తూ ఉండేవాడు. ఆ ఫ్లాట్ లోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ ని ఆదా శర్మ కొనుగోలు చేసినట్లుగా మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. 

ఆదా శర్మ ఆ ఫ్లాట్ కి సంబదించిన చిన్న చిన్న రిపేర్లు చేయించుకుని త్వరలోనే తన పేరెంట్స్ తో కలిసి ఆ ఫ్లాట్ కి షిఫ్ట్ అవ్వబోతుంది అంటున్నారు. అయితే ఈ న్యూస్ ఇంత వైరల్ అవుతున్నా ఆదా శర్మ నుండి దీనిపై ఎలాంటి స్పందన లేదు. అసలు ఆమె ఆ ఫ్లాట్ ని కొన్నాదా..  లేదా.. అనేది తెలియాల్సి ఉంది.  

Adah Sharma buys flat SSR lived in before his death:

Is Adah Sharma Buying Sushant Singh Rajput Bandra Flat?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement