Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ ని రిసీవ్ చేసుకున్న బాలయ్య


ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని ఈ రోజు విజయవాడలో అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధిగా హాజరవుతారని నందమూరి బాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్, బాలకృష్ణలు ముఖ్య అతిధులుగా హాజరుకానున్న ఈవెంట్ ఈ రోజు శుక్రవారం.. విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో జరపతలపెట్టారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం పది గంటలకి చెన్నై నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ ఎయిర్ పోర్ట్ కి రాగా.. నందమూరి బాలకృష్ణ, T D జనార్దన్ సూపర్ స్టార్ కి సాదర స్వాగతం పలికారు. బాలకృష్ణ రజినీకాంత్ ని ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. బాలయ్య ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తల కోలాహలం నడుమ అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Super star Rajinikanth arrived at Vijayawada:

Rajinikanth welcomed by Balakrishna at Vijayawada airport
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs