Advertisement
Google Ads BL

లాస్ట్ మినిట్ లో వెనక్కి తగ్గారు.


అందరి కన్నా ముందే ఫిబ్రవరి 25 న వస్తున్నాం.. ఫ్యామిలీ ఆడియన్స్ రెడీ గా ఉండండి.. అంటూ రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్స్ చేసుకుంటున్న శర్వానంద్.. మధ్యలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా అదే డేట్ కి వస్తున్నా వెనక్కి తగ్గేదేలే అంటూ తన డేట్ కే ఫిక్స్ అయ్యి.. ప్రమోషన్స్ జోరు పెంచేసాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్యామిలీ ఎంటర్టైనర్.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మాస్ ఎంటర్టైనర్.. సో మాకేం ఫికర్ పడదు అనుకున్న శర్వా ఎట్టకేలకి వెనక్కి తగ్గారు. అది కూడా సెన్సార్ పూర్తి చేసుకుని.. సెన్సార్ పోస్టర్ తో డేట్ మార్చేశారు మేకర్స్.

Advertisement
CJ Advs

ఫిబ్రవరి 25 న రిలీజ్ కావల్సిన ఆడవాళ్లు మీకు జోహార్లు అఫీషియల్ గా మార్చ్ 4th కి పోస్ట్ పోన్ అయ్యింది. క్లీన్ యు సర్టిఫికెట్ తో కుటుంబ కథా చిత్రంగా ఆడవాళ్లు మార్చి 4న రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతుంది. ఇక రేపు యధావిధిగా ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్ ఈవెంట్ శిల్ప కళావేదికలో కీర్తి సురేష్, సాయి పల్లవి అతిధులుగా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Aadavaallu Meeku Johaarlu changes its release date:

Aadavaallu Meeku Johaarlu&nbsp;<span>censored,</span>&nbsp;changes its release date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs