Advertisement
Google Ads BL

ఒకరికి తెలియకుండా మరొకరు శ్రీవారి సేవలో


మంచు మోహన్ బాబు కూతురు లక్ష్మి, మంచు మనోజ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంచు మనోజ్‌ మీడియాతో మాట్లాడారు. పండుగ సందర్భంగా తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. అంతేగాక లక్ష్మీ, తాను అనుకోకుండా ఇక్కడికి వచ్చామ​న్నారు. ఇద్దరూ వేరువేరుగా ప్లాన్‌ చేసుకుని అనుకోకుండా ఇక్కడ కలిశామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అంట్లడుతున్న మనోజ్ తన సినిమాలపై స్పందిస్తూ ప్రస్తుతం తాను అహం బ్రహ్మాస్మ’ మూవీ చేస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే దీనిపై అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు కూడా తెలిపాడు. ఇక తాను కొత్తగా ఓ బిజినెస్‌ మొదలు పెట్టబోతున్నట్లు కూడా వెల్లడించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు కొత్త ఓ వెంచర్‌ను మొదలు పెట్టబోతున్నానని పేర్కొన్నారు. తిరుపతిలో మంచు అక్కా, తమ్ముళ్ల సందడి ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

Manchu Manoj, Lakshmi at Tirupati Balaji Temple:

Manchu Manoj, Lakshmi at Tirupati
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs