Advertisement

ఎన్టీఆర్ ఫాన్స్ లో ఏదో చిన్న నిరాశ


ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే సర్ప్రైజ్ లని బాగా ఎంజాయ్ చేసారు. కొరటాల శివ మూవీ లుక్ తో పాటుగా, ఆర్.ఆర్.ఆర్ కొమరం భీం లుక్ అంతేకాదు.. NTR31 ప్రశాంత్ నీల్ అనౌన్సమెంట్ తో మంచి ఖుషి అయ్యారు. ఎన్టీఆర్ సెలెబ్రేషన్స్ వద్దని చెప్పి నిరాశ పరిచినా.. ఫాన్స్ కి కావాల్సిన ట్రీట్స్ మాత్రం వచ్చాయి. ఇక చివరిగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన సినిమాపై క్లారిటీ ఇచ్చినట్టే కనిపిస్తుంది. అన్ని రకాల అప్ డేట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ కి ఊపిరాడనంత సంతోషం తో ఉన్నప్పటికీ.. మరో అప్ డేట్ కోసం ఎదురు చూసారు.

Advertisement

అదే ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్ చెయ్యబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గురించిన క్లారిటీ ఇవ్వకుండా జెమిని ఛానల్ వారు ఎన్టీఆర్ ఫాన్స్ ని నిరాశ పరిచారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో పోస్ట్ పోన్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎవరు మీలో కోటీశ్వరులు షో కి సంబందించిన ప్రోమోస్ కూడా ఎప్పుడో కట్ చేసి ప్లే చేసారు. అప్పటినుండి ఆ షో త్వరలోనే అంటుంది కానీ.. ఎప్పుడో చెప్పడం లేదు. అంటే నిజంగానే కరోనా టైం లో ఆ షో ఎందుకని ఆపేసారా? ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని బుల్లితెర మీద చూద్దామా అని వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి ఎన్టీఆర్ బర్త్ డే రోజున దానికి సంబందించిన అప్ డేట్ కూడా వస్తే బావుండేది. 

Something a little disappointing in NTR Fans:

Ntr fans disappointed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement