Advertisement
Google Ads BL

పూజా హెగ్డేని పరుగులు పెట్టిస్తున్నారు!


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’, మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న మహేష్ 25 చిత్రం.. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పూజా హెగ్డేయే కావడం విశేషం. ఈ రెండు సినిమాలు హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

Advertisement
CJ Advs

ఈ రెండిట్లో పూజా హెగ్డే మీద సన్నివేశాలు తీసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు ఇరు చిత్రాల డైరెక్టర్స్. సో దీంతో పూజా అటు ఎన్టీఆర్ సినిమాతో పాటు.. ఇటు మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతుందంట.  ఎవరి సినిమాకీ నో చెప్పలేని పరిస్థితి. దాంతో రెండు సినిమాల సెట్స్ మధ్య పూజా హెగ్డే చక్కర్లు కొట్టక తప్పడం లేదు. ఒక సెట్ లో సీన్ కంప్లీట్ అవ్వగానే మరో సెట్ కు వెళ్లి ఇంకో సీన్ చేస్తూ బిజీ అయిపోతుందట.

ఇలా గతంలో హీరో హీరోయిన్లు ఇదే విధంగా షూటింగ్ చేసేవారు. రోజుకి రెండు మూడు షిఫ్టులు లెక్కన పనిచేసేవారు. ఆ తర్వాత టెక్నాలజీ పెరగడంతో షాట్స్ తీయడం ఆలస్యం అవుతుంది. అందుకే ఇప్పుడు మన హీరోస్ ఒక్కొక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి మాత్రం అలా లేదు.

Pooja Hegde Busy with NTR And Mahesh Babu Movie Shootings :

Pooja Hegde Heroine in Mahesh 25 and Jr NTR Aravinda Sametha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs