కేవలం రామ్చరణ్ అనే కాదు.. అందరు స్టార్స్కి ఇప్పుడు ఓ ఇంట్రడక్షన్ సాంగ్, స్పెషల్ లేదా ఐటం సాంగ్ కంపల్సరిగా మారుతోంది. సుకుమార్ సైతం 'రంగస్థలం 1985' చిత్రంలో పూజాహెగ్డేతో ఓ స్పెషల్సాంగ్ని చిత్రీకరించనున్నాడు. ఇక దీని తర్వాత రామ్చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వదినల సెంటిమెంట్కి యాక్షన్డోస్ని ఇచ్చి బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇందులో ఏకంగా రామ్ చరణ్ కి నలుగురు వదినలు అంటే నలుగురు అన్నలు ఉంటారు. స్నేహ, ప్రశాంత్లు పెద్ద అన్న, వదినలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవలే స్టార్ట్ అయింది. ఇందులో 'భరత్ అనే నేను' హీరోయిన్ కైరా అద్వానీనే రామ్చరణ్, బోయపాటితో పాటు దానయ్య ఫైనలైజ్ చేశాడు. అయితే ఈ చిత్రంలో కూడా రామ్చరణ్కి మరో టాప్ హీరోయిన్తో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట.
ఇక దేవిశ్రీ ప్రసాద్ ఐటం సాంగ్స్కి ఇచ్చే ట్యూన్స్ ఎలా జనరంజకంగా, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటాయనేది తెలిసిన సంగతే. దాంతో 'రంగస్థలం 1985'తో పాటు బోయపాటి చిత్రానికి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి చరణ్ సరసన డ్యాన్స్ చేసే ఆ టాప్ హీరోయిన్ ఎవరు? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు చరణ్ అభిమానులను బోయపాటి చిత్రం ఓ సెంటిమెంట్ భయపెడుతోంది. గతంలో శ్రీనువైట్ల తీసిన 'బ్రూస్లీ' చిత్రం మొదటి షెడ్యూల్లో కూడా రామ్చరణ్ పాల్గొనలేదు. అది డిజాస్టర్ అయింది. ఇప్పుడు బోయపాటి శ్రీను చిత్రం మొదటి షెడ్యూల్లో కూడా రామ్చరణ్ పాల్గొనలేదు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా, లేదా దీపావళి కానుకగా విడుదల చేసి అక్టోబర్ నుంచి రామ్చరణ్ ఎన్టీఆర్తో కలిసి నటించే రాజమౌళి చిత్రంలో బిజీ కానున్నాడు.