Advertisement
Google Ads BL

రజనీ కమిట్‌మెంట్‌ చూసి షాక్‌ అయ్యాడట..!


రజనీకాంత్‌కు పని మీద ఉన్న అంకితభావం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. కాగా ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా, అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న '2.0' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీ తన పార్ట్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాడు. ఇండియాలోనే హైయ్యస్ట్‌ బడ్జెట్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అకాడమీ అవార్డు గ్రహీత, సౌండ్‌ ఇంజనీర్‌ రసూల్‌ పోకుట్టి పనిచేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

రజనీ చేత డబ్బింగ్‌ చెప్పించడం కోసం తాను చెన్నై వెళ్తున్నానని ట్వీట్‌ చేసిన ఆయన ఆ తర్వాతి ట్వీట్లలో రజనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రానికి ఒక్కరోజులోనే తలైవా రజనీ మూడు రీళ్లకు ఏకధాటిగా డబ్బింగ్‌ చెప్పి, తనని ఆశ్యర్యపరిచాడని, ఆయనకున్న అంకిత భావం చూసిన తర్వాత ఆయన అంత గొప్పనటుడు ఎలా అయ్యాడు? ఆయనకున్న వరల్డ్‌వైడ్‌ ఇమేజ్‌కి కారణాలు తనకి అర్ధమయ్యాయన్నాడు. ఈ చిత్రం 'రోబో'కు సీక్వెల్‌ కాదని, ఇదో విభిన్నమైన చిత్రమని మెచ్చుకున్నాడు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, జపనీస్‌, చైనీస్‌ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs