Advertisement
Google Ads BL

శ్రీదేవి కూతురు పై మరో న్యూస్..!


శ్రీదేవి అతిలోకసుందరిగా అందరికి బాగా దగ్గరైంది. ఇక శ్రీదేవిని అప్పట్లో అందరూ పూజించేవారంటే అతిశయోక్తి లేదు. అప్పట్లో ఏమిటి ఇప్పటికి శ్రీదేవంటే చొంగ కార్చేసుకుంటారు మగాళ్లు. అయితే శ్రీదేవి కెరీర్ పీక్ స్టేజి లో ఉండగానే బోణి కపూర్ ని పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలకి తల్లయింది. ఇక అప్పటినుండి బాలీవుడ్ లో సెటిల్  అయిన శ్రీదేవి అక్కడ కూడా బాగా పేరు తెచ్చుకుంది. శ్రీదేవి కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్న వాళ్లెవరు అటు తెలుగు ఇండస్ట్రీలోని గాని ఇటు బాలీవుడ్ లో గాని అప్పట్లో ఎవరూ లేరు. ఇక శ్రీదేవికి, బోనీ కపూర్ కి జాహ్నవి, ఖుషి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వారిని కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యడానికే శ్రీదేవి మొగ్గు చూపుతోందని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఇక ముందుగా పెద్ద కూతురు జాహ్నవిని హీరోయిన్ గా చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకే జాహ్నవికి ఆమె నటనలో కూడా శిక్షణ ఇప్పించిందని ప్రచారం జరిగింది. ఇక అప్పటినుండి ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని తెగ ప్రచారం మొదలైంది. అయితే ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందా లేక  టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందా అనేది మాత్రం సస్పెన్సు  గానే వుంది. అయితే ఇప్పుడు జాహ్నవిని బాలీవుడ్ నుండి ఎంట్రీ ఇప్పించాలని శ్రీదేవి సకల ప్రయత్నాలు చేస్తుందని.... అందుకే శ్రీదేవి.. కరణ్ జోహార్ ని సంప్రదించిందనే టాక్ బయటికి వచ్చింది. ఇక కరణ్ జోహార్  డైరెక్షన్ లో వరుణ్ ధావన్ కి జంటగా జాహ్నవి చేయనుందని ఒక టాక్ బయటికి వచ్చింది. ఇక ఈ విషయాన్ని శ్రీదేవి గానీ, బోనీ కపూర్ గానీ కన్ఫర్మ్ చెయ్యలేదు.

ఇంతకు ముందు కూడా జాహ్నవి.. మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని ప్రచారం జరిగింది కానీ అది ఒట్టి రూమర్ అని శ్రీదేవి సైతం కొట్టి పారేశారు మరి ఈ బాలీవుడ్ ఎంట్రీ కూడా నిజమా లేక రూమరా అనేది తెలియాల్సి వుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs