Advertisement

తన విలన్ పై చరణ్‌ ప్రశంసల వర్షం!


ప్రతినాయకుడి పాత్ర బలంగా ఉంటేనే ఎంతటి స్టార్‌హీరో క్యారెక్టర్‌ అయినా ఎలివేట్‌ అవుతుంది. ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు.  తమిళ 'తని ఒరువన్‌' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన అరవింద్‌స్వామి నటనను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది.  ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో కూడా అరవింద్‌స్వామిని రీప్లేస్‌ చేసి ఎవరిని పెట్టినా ఆ పాత్రకు న్యాయం చేయలేరనిపించి తెలుగు రీమేక్‌ 'ధృవ'లో కూడా రామ్‌చరణ్‌కు ప్రతినాయకుడిగా అరవింద్‌స్వామినే తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌లోకి రామ్‌చరణ్‌ రీసెంట్‌గా జాయిన్‌ అయ్యాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ తర్వాత మరో షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్లాన్‌ చేశారు. అయితే ఈ చిత్రం షూటింగ్‌ జరిగిన రెండు షెడ్యూల్స్‌ అవుట్‌పుట్‌ పట్ల రామ్‌చరణ్‌ ఎంతో హ్యాపీగా ఉన్నాడట. ఇక ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న అరవింద్‌స్వామి నటనపై చెర్రీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన పెద్ద మేజర్‌ ఎస్సెట్‌ అవుతాడనే నమ్మకాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్‌ వ్యక్తం చేశాడు. నిజమే.. తమిళంలోలాగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే హీరో పాత్ర కన్నా విలన్‌ పాత్ర పెద్ద హైలైట్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement