Advertisement

పవన్‌కి మరో దర్శకుడు ఫిక్స్‌ అయ్యాడు!


ప్రస్తుతం ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఈ చిత్రం తర్వాత ఎ.యం.రత్నం నిర్మాతగా తమిళంలో పెద్ద విజయం సాధించిన అజిత్‌ చిత్రం 'వేదాలమ్‌' రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా దర్శకునిగా పరిచయం ఉన్న శివకే ఈ చిత్రం దర్శకత్వ బాద్యతలను అప్పగిస్తారని అందరూ ఊహించారు. కానీ విచిత్రంగా ఈ చిత్రానికి మరో తమిళ దర్శకునికి అవకాశం ఇచ్చారు. విజయ్‌, మోహన్‌లాల్‌ను కలిసి నటించిన 'జిల్లా' చిత్రానికి దర్శకత్వం వహించిన నేశన్‌ దర్శకత్వంలో పవన్‌ హీరోగా 'వేదాలమ్‌' రీమేక్‌ రూపొందనుందని సమాచారం. ఈ విషయాన్ని నేశన్‌ కన్‌ఫర్మ్‌ చేశాడు. ప్రస్తుతం పవన్‌తో డిస్కషన్స్‌ జరుగుతున్నాయని ఆయన కోలీవుడ్‌ మీడియాకు తెలిపాడు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement