Advertisement

బాలీవుడ్ లోకి పవన్‌ హీరోయిన్‌..!


పవన్‌కళ్యాణ్‌తో కలిసి 'ఖుషీ' వంటి బ్లాక్‌బస్టర్‌లో నటించిన హీరోయిన్‌ భూమిక ఆ తర్వాత పలువురు స్టార్స్‌ సరసన నటించింది. ఆ తర్వాత ఆమె భరత్‌ఠాకూర్‌ను పెళ్లి చేసుకొని కొంతకాలం వెండితెరకు దూరంగా ఉంది. ఇటీవల అల్లరినరేష్‌-రవిబాబుల కాంబినేషన్‌లో వచ్చిన 'లడ్డూబాబు'లో కూడా ఆమె మంచిపాత్రనే చేసింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో మరలా ఆమె మరికొంతకాలం గ్యాప్‌ తీసుకొని ఓ హిందీ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ధోని జీవిత గాధ ఆధారంగా బాలీవుడ్‌లో నీరజ్‌పాండే దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని ఓ కీలకపాత్రను చేయడానికి భూమిక ఓకే చేసింది. ఈ చిత్రంతో తనకు వచ్చే రెస్పాన్స్‌ను చూసి మరలా సౌత్‌ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించాలనేది ఆమె ఆలోచనగా ఉందిట...! 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement