పూరీజగన్నాథ్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మాతగా సీకె ఎంట్టైన్మెంట్స్ పతాకంపై మెగాహీరో వరుణ్తేజ్ నటించిన 'లోఫర్' చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ను చూసిన వారు ఈ ట్రైలర్ పూరీ స్టాండర్డ్స్లో లేదని అంటున్నారు. గతంలో పూరీ దర్శకత్వంలోనే ప్రభాస్ హీరోగా చేసిన 'ఏక్నిరంజన్' చిత్రం తరహాలో ఈ ట్రైలర్ ఉందని అంటున్నారు. ఏదేమైనా తన మొదటి రెండు చిత్రాలతో క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకున్న వరుణ్తేజ్ తన మూడో చిత్రంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు, మాస్కు బాగా దగ్గరవ్వాలని భావిస్తున్నాడు. గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన రవితేజ 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' తరహాలో ఈ చిత్రం మదర్ సెంటిమెంట్తో తెరకెక్కిందని తెలుస్తోంది. ఇందులో వరుణ్తేజ్ తల్లి పాత్రలో రేవతి నటిస్తోంది.