Advertisement

వరుణ్‌తేజ్‌తో సినిమా చేయనున్న దర్శకరచయిత!


తన మొదటి చిత్రం ముకుందతో పెద్దగా విజయం సాధించలేకపోయిన మెగాహీరో, మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్న కంచె చిత్రంపై భారీ ఆశలు పెట్టుకొని పెట్టుకొన్నాడు. ఈ చిత్రం 22వతేదీన విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం తర్వాత వరుణ్‌తేజ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విడుదలకానుంది. ఈ రెండు చిత్రాల తర్వాత దర్శకరచయిత వీరుపోట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ ఓ సినిమా కమిట్‌ అయినట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవలే వీరుపోట్ల నాగబాబు, వరుణ్‌తేజ్‌లను కలిసి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నాడని.. స్వతహాగా మంచి రచయిత అయినప్పటికీ వీరుపోట్ల ఈ చిత్రాన్ని తన సొంత కథతో కాకుండా వెలిగొండ శ్రీనివాస్‌ అందించిన కథతో తెరకెక్కించనున్నాడని సమాచారం. మొత్తానికి మెగాహీరో వరుణ్‌తేజ్‌ తదుపరి చిత్రం కూడా ఖరారైపోయిందని అంటున్నారు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement