శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు. వారంతా తమిళులు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబుకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో చంద్రబాబుతో కలిసి 'లయన్' ఆడియో వేడుకలో త్రిష నవ్వులు చిందించడం వివాదాస్పదం అయ్యింది. త్రిషపై అక్కడ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. త్రిష తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పాపం.. త్రిష. సమస్యను ఎలా పరిష్కరించుకుంటుందో..