Advertisement

జర్నలిస్ట్ భగీరథను అభినందించిన చంద్రబాబు


తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు  ప్రపంచంలోని తెలుగువారందరికీ స్ఫూర్తి ప్రదాతని, ఆయన నిస్వార్థ, నిరుపమాన ప్రజాసేవకుడని తెలుగు దేశం పార్టీ జాతీయ  అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చెప్పారు.  . 

Advertisement

ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ తాను రచించిన మహానటుడు, ప్రజా నాయకుడు -ఎన్ .టి .ఆర్ అన్న పుస్తకాన్ని  నారా చంద్ర బాబు నాయుడు గారికి బహూకరించాడు. శుక్రవారం సాయంత్రం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు , నిర్మాత యలమంచిలి అనిల్ బాబు, రామరాజు శ్రీనివాస్ తో కలసి  భగీరథ చంద్ర బాబు నాయుడు ను మంగళగిరి లోని తెలుగు దేశం కార్యాలయంలో కలిశారు . 

ఎన్ .టి .రామారావు గారి శత జయంతి సందర్భంగా జర్నలిస్టుగా వారితో వున్న అనుబంధం, వారితో చేసిన ఇంటర్వ్యూలతో మహానటుడు , ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ అన్న పుస్తకాన్ని రచించిన జర్నలిస్టు, రచయిత భగీరథను చంద్ర బాబు నాయుడు అభినందించారు .   

శుక్రవారం రోజు చంద్ర బాబు నాయుడు గారి  సందర్శన కోసం ఎంతో మంది వేచి వున్నా, తమతో చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడినందుకు భగీరథ, రాంబాబు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు

Chandrababu congratulates Bhagiratha:

Chandrababu congratulates Journalist Bhagiratha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement