హీరో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' సినిమా ఆడియో వేడుక జూలై 7న జరగబోతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రకృతే సాక్షంగా ఈ సినిమా రూపొందించబడుతోంది.
శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఆర్తు ఏ విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సాక్ష్యం సినిమాకు ప్రధానబలం కానున్నాయి. 'బాహుబలి' చిత్రానికి సిజి వర్క్ చేసిన టీం ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'సాక్ష్యం' చిత్రంలోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ అభించింది. 'టైమ్స్ మ్యూజిక్ సౌత్' సంస్థ సాక్షం చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్, రావ్ రమేష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, మరియు నటి మీనా ఈ చిత్రంలో నటించారు.