Advertisement
Google Ads BL

'దృశ్యం'లో టబూ..!!


మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన 'దృశ్యం' సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో పునిర్నిమాణమైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక అటుపై ఇప్పుడు తమిళంలో కూడా ఈ సినిమా తిరిగి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌కు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మలయాళంలో ఆశా శరత్‌ పోషించిన ఈ పాత్రలో తెలుగులో నదియా నటించారు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో ఈ పాత్రలో హైదరాబాద్‌ సొగసరి టబూ నటించనున్నట్లు సమాచారం. ఈపాత్ర కోసం పలువురు బాలీవుడ్‌ వెటరన్‌ హీరోయిన్లను మొదట పరిశీలించినప్పటికీ టబూ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించిన చిత్ర యూనిట్‌ ఆమెను ఎంచుకుంది. అజయ్‌దేవగణ్‌ హీరోగా నటించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs