Advertisement

‘స్విమ్మింగ్‌ పూల్‌’ లోగో ఆవిష్కరణ


అఖిల్‌ కార్తీక్‌, ప్రియ వశిష్ట జంటగా శ్రీశ్రీ మూవీస్‌ పతాకంపై చిమ్మని మనోహర్‌ దర్శకత్వంలో అరుణ్‌కుమార్‌ ముప్పన నిర్మిస్తున్న హార్రర్‌ థ్రిల్లర్‌ ‘స్విమ్మింగ్‌ పూల్‌’.  ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను శనివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు ఓషో తులసిరామ్‌ లోగోను ఆవిష్కరించారు. విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో..

Advertisement

చిమ్మని మనోహర్‌: 13 రోజుల్లో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేయడం జరిగింది. ఫామ్‌హౌస్‌లో వున్న స్విమ్మింగ్‌పూల్‌ వల్ల ఒక ప్రేమ జంట ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారన్నదే కథ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే ఆడియోతోపాటు చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం.

అరుణ్‌ కుమార్‌ ముప్పన: ఈ చిత్రాన్ని పర్యావరణ పరిరక్షణ చేసే కార్భన్‌ న్యూట్రల్‌ విధానంతో సినిమాని తెరకెక్కించాం. ఇప్పటివరకు ఈ పద్ధతిలో ఎవరూ సినిమా చెయ్యలేదు. డైరెక్టర్‌ మనోహర్‌గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement